ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయం దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీకి ఊరట (Relief to HDFC) కల్పించింది. కొత్త క్రెడిట్ కార్డుల జారీ చేసేందుకు హెచ్డీఎఫ్సీకి ఆర్బీఐ ఆమోదం లభించింది. దీంతో గత రెండేండ్లుగా బ్యాంకు డిజిటల్ సర్వీసెస్లో ఆటంకాలు తొలగిపోవడంతో త్వరలో మళ్లీ క్రెడెట్ కార్డులు జారీ చేసేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు సిద్ధమైంది. త్వరలోనే డిజిట్ 2.0 ను ప్రారంభిస్తామని బ్యాంకు వెల్లడించింది. ఈ నిర్ణయం ప్రభావం బ్యాంక్ స్టాక్ మీద కనిపించింది. ఇవాళ ఈ బ్యాంకు షేరు 1.16 శాతం అధికంగా రూ.1,533 వద్ద ట్రేడవుతున్నది.
పదే పదే సాంకేతిక కారణాలు తలెత్తడంతో క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా గత డిసెంబర్ నెలలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. అదే డిసెంబర్ నెలలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.54 కోట్ల క్రెడిట్ కార్డులను జారీ చేసింది. హెచ్డీఎఫ్సీపై నిషేధం ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు కలిసొచ్చింది. దాంతో జనవరి 2021 లో హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుల సంఖ్య 1.48 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో ఎస్బీఐ 1.2 కోట్లు, ఐసీఐసీఐ 90 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేసింది. ప్రస్తుతం నిషేధం ఎత్తివేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో.. క్రెడిట్ కార్డులపై హెచ్డీఎఫ్సీ ప్రత్యేక దృష్టి సారించనున్నది.
ఆఫ్ఘాన్ను తాలిబాన్ ఆక్రమించుకోవడం సబబే: సజ్జాద్ నోమాని
ప్రాణాలకు తెగించి హక్కుల కోసం గళమెత్తారు..
నేతాజీ… గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు..
ట్విట్టర్ బర్డ్ ఫ్రై.. ఎందుకు చేశారంటే..?
వారు అధికారంలోకొచ్చారు.. మహిళా మోడల్స్పై సున్నమేశారు..!