పుణె : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ వేరియంట్ భయాందోళనలకు గురి చేస్తున్నది. ఈ క్రమంలో ఒకటి నుంచి 7వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయాన్ని డిసెంబర్ 15 వరకు పుణె మున్సిపల్ కార్పొరేషన్ వాయిదా వేసింది. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించిన అనంతరం పాఠశాలల పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఇంతకు ముందు డిసెంబర్ 1 నుంచి పాఠశాలలను పునః ప్రారంభించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. ఓమిక్రాన్ వేరియంట్ (B.1.1.529), కరోనావైరస్ కొత్త రూపాంతరాన్ని తొలిసారిగా ఈ నెల 11న బోట్స్వానాలో నివేదించగా.. 14న కనిపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది.