భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (Madhya Pradesh Polls) సంబంధించి కాంగ్రెస్ మంగళవారం ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. మ్యానిఫెస్టోలో ఓటర్లపై వరాల జల్లు కురిపించింది. పాత పెన్షన్ స్కీమ్, కులగణన, ఓబీసీ కోటా, రూ 25 లక్షల బీమా వంటి పలు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది.
మహిళలకు నారీ సమ్మాన్ నిధి పేరిట నెలకు రూ. 1500 భృతి, ప్రభుత్వ సర్వీసుల్లో 27 శాతం ఓబీసీ కోటా వంటి హామీలతో కూడిన మ్యానిఫెస్టోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాధ్ విడుదల చేశారు. రైతులకు రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి 101 ప్రధాన గ్యారంటీలను మ్యానిఫెస్టోలో పొందుపరిచారు.
ఇందిరా గాంధీ గృహ యోజన కింద 100 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, ఉచితంగా పాఠశాల విద్యను అందుబాటులోకి తీసుకువస్తామని కమల్ నాధ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆరోగ్య హక్కు చట్టాన్ని తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. రైతు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. సాగర్లో శిరోమణి రవిదాస్ పేరిట నైపుణ్య శిక్షణా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పలు హామీలు గుప్పించింది.
Read More :
Encounter | బీజాపూర్లో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి