బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బండిపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు (Maoist) చనిపోయాడు. బండిపొరా (Bandepara) అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరుపక్షాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని బస్తర్ ఐజీ పీ సుందర్రాజ్ (IG P Sundarraj) తెలిపారు.
ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని వెల్లడించారు. మృతుడిని గుర్తించాల్సి ఉందన్నారు.
Bijapur, Chhattisgarh | One naxal killed in an encounter between security forces and naxals in the forest of Bandepara. AK-47 rifle recovered. Search operation continues after the encounter: IG Bastar P Sundarraj
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 17, 2023