పాట్నా: ఈ వంతెన నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ను అందిస్తున్నారో తెలియదు.. అసలు ఈ వంతెనను ప్రజలు ఎప్పటికైనా ఉపయోగించుకుంటారో లేదో.. బీహార్లోని (Bihar) భాగల్పూర్లో (Bhagalpur) గంగా నదిపై (Ganga River) నిర్మితమవుతున్న బ్రిడ్జిపై (Bridge) ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి అనుమానం. ఎందుకంటే ఆ వంతెన నిర్మాణంలో ఉండగా రెండుసార్లు కూలిపోయింది. అప్పుడెప్పుడో 2014లో ప్రారంభమైన దీని నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడం గమనార్హం. ఆ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలయడం లేదంటూ ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
#WATCH | Bhagalpur, Bihar:…" not sure what kind of material is being provided for the bridge construction…not sure if public will ever be able to use this bridge…": Pramod Kumar, eyewitness pic.twitter.com/2LI8CVNH9A
— ANI (@ANI) June 5, 2023
తొలుత ఏదో పేలుడు సంభవించిందని అనుకున్నాం.. చూస్తే బ్రిడ్జి కూలిపోయిందని అర్థమైందని రాకేశ్ కుమార్ అనే వ్యక్తి అన్నారు. ఇది ప్రభుత్వ అవినీతిని తెలియజేస్తున్నదని విమర్శించారు. బ్రిడ్జి కూలిపోవడం ఇదే మొదటిసారి కాదని.. ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
#WATCH | Bhagalpur, Bihar:…" Initially we thought it was a blast…later we understood that the bridge had collapsed…this shows the corruption in the govt…this is not the first time…this state govt is corrupted, there should be a probe…": Rakesh Kumar, an eye witness of… pic.twitter.com/Pg7o0Kdcpr
— ANI (@ANI) June 5, 2023
బీహార్లోని ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ గంగానదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కూలిపోయిన విషయం తెలిసిందే. సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) కలల ప్రాజెక్టు అయిన దీనిని 3.1 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లతో రూ.1,710 కోట్లతో అగువాని సుల్తాన్గంజ్ పేరుతో నిర్మిస్తున్నారు. 2014లో దీని నిర్మాణానికి నితీశ్ కుమార్ శంకుస్థాపన చేశారు. 2020 నాటికే ఈ వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. ఇప్పటికే ఓసారి ఇది కూలిపోయింది.
#WATCH | Bihar: Latest visuals from the spot where under construction Aguwani-Sultanganj bridge in Bhagalpur collapsed for the second time pic.twitter.com/pivnuwVVXy
— ANI (@ANI) June 5, 2023