న్యూఢిల్లీ: రైల్వేలను ప్రైవేటీకరించడం లేదని, అది కేవలం ఊహాజనితమైన వాదన అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. రైల్వే ప్రైవేటీకరణపై చర్చించలేదని, ప్లానింగ్ కూడా లేదన్నారు. రైళ్లు, బోగీలు, ట్రాక్లు, స్టేషన్లు, ఇంజిన్లు, విద్యుత్తు తీగలు, కోచ్లు, సిగ్నలింగ్ వ్యవస్థ మొత్తం రైల్వేకే చెందుతోందని, ఎలా రైల్వే ప్రైవేటీకరణ జరుగుతుందని, ఎక్కడా అలా జరగడం లేదని మంత్రి వైష్ణవ్ అన్నారు. రైల్వేశాఖ గ్రాంట్స్పై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి వివరణ ఇస్తూ.. రవాణా రైళ్లను ప్రైవేట్పరం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. రవాణా రైళ్లను ప్రైవేటీకరించడంలేదన్నారు. రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీ వేగంగా జరుగుతోందని, తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 3 లక్షల రైల్వే ఉద్యోగాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్పై ఎక్కడా బ్యాన్ విధించలేదన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీలు భారతీయ రైల్వేకు భద్రతా సర్టిఫికేట్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.