Formers protest | ఢిల్లీ సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తల్లో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయినట్లుగా వచ్చిన వార్తలపై హర్యానా పోలీసులు (Haryana Police) తాజాగా స్పందించారు. ఈరోజు సరిహద్దుల్లో జరిగిన ఉద్రిక్తల్లో రైతులు ఎవరూ చనిపోలేదని వెల్లడించారు. ‘ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. సరిహద్దు వద్ద ఈరోజు రైతులు ఎవరూ చనిపోలేదు. ఇది కేవలం పుకారు మాత్రమే. డేటా సింగ్-ఖనోరీ సరిహద్దు (Data Singh-Khanori border)లో ఇద్దరు పోలీసులు, ఒక నిరసనకారుడు గాయపడినట్లు సమాచారం ఉంది’ అని హర్యానా పోలీసులు స్పష్టం చేశారు.
“According to the information received so far, no farmer has died today. This is just a rumour. There is information about two policemen and one protestor being injured at Data Singh-Khanori border,” says Haryana Police on farmers’ protest. pic.twitter.com/tgkF8gZw4G
— ANI (@ANI) February 21, 2024
ఛలో ఢిల్లీ (Chalo Dilli) పేరిట రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. పంటలకు కనీస మద్దతు ధర అంశంలో కేంద్రం ప్రతిపాదనలను తిరస్కరిస్తూ రైతులు మరోసారి ఆందోళనబాట పట్టిన విషయం తెలిసిందే (Formers protest). ఈ క్రమంలో ఢిల్లీలోకి ప్రవేశించేందుకు పెద్ద ఎత్తున రైతులు సరిహద్దుల వద్దకు చేరుకున్నారు. పోలీసులు రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయినట్లుగా వార్తలు వచ్చాయి.
Also Read..
Farmers Protest | ఖనౌరీ సరిహద్దుల్లో కాల్పులు.. ఇద్దరు రైతుల మృతి..!
Avalanche | సింధ్ నదిని ముంచెత్తిన అవలాంచ్.. రోడ్లపైకి నీరు