ముంబై : ఏడాదిలోగా ముంబై-గోవా హైవే పనులు పూర్తవుతాయని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. భూసేకరణ, అటవీ శాఖ, రైల్వేల నుంచి అనుమతుల కోసం ప్రాధమిక పనుల్లో జాప్యం జరిగిందని అన్నారు. ముంబై-గోవా హైవే పనులు పదకొండు దశల్లో జరుగుతున్నాయని చెప్పారు.
ముంబై-గోవా హైవే ఈ ప్రాంతానికి గుండెకాయ వంటిదని ఈ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని మంత్రి గడ్కరీ తెలిపారు. ముంబై-గోవా హైవేను మంగళూర్ వరకూ పొడిగిస్తామని అన్నారు. ముంబై-గోవా హైవేపై ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే లాజిస్టిక్స్ పార్క్, ట్రక్ టెర్మినల్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కొంకణ్ ప్రాంతంలో ప్రత్యేక ఆర్ధిక మండలి ద్వారా త్వరలో 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సమకూరుతాయని అన్నారు. రాయ్గఢ్ జిల్లాలో రూ 131.87 కోట్లతో చేపట్టిన మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంబించారు. రూ 430 కోట్లతో 42 కిలోమీటర్ల పొడవైన రహదారుల నిర్మాణానికి ఆయన శంకుస్ధాపన చేశారు.