BJP Second List : లోక్సభ ఎన్నికలకు 72 మంది అభ్యర్ధులతో బీజేపీ రెండో జాబితాను బుధవారం ప్రకటించింది. రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, హరియాణా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్లకు చోటు దక్కింది. ఇక లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే విడుదల చేసింది.
ఇందులో మొత్తం 195 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బరిలో దిగనుండగా తొలి జాబితాలో 34 మంది మంత్రులు, స్పీకర్, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మొదటి జాబితాలో 28 మంది మహిళలకు టికెట్లు ఇచ్చారు.
షెడ్యూల్ కులాల నుంచి 27, గిరిజనుల నుంచి 18, ఓబీసీల నుంచి 57 మందికి టికెట్లు ఇచ్చారు. ఇక గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతీ ఇరానీ, కాంతీ నుంచి సువేందు అధికారి, ఫతేపూర్ నుంచి సాథ్వీ నిరంజన్ జ్యోతి, మధుర నుంచి హేమా మాలిని లోక్సభ ఎన్నికల బరిలో దిగనున్నారు.
Read More :