Loksabha Elections 2024 : దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై విపక్షాలు, విధాన నిర్ణేతల నుంచి మేథావుల వరకూ ఆందోళన వ్యక్తం చేస్తుంటే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం నిరుద్యోగ సమస్యపై భిన్నంగా స్పందించారు. యువత ఉద్యోగాలు లేక సతమతమవుతుంటే ఆర్ధిక మంత్రి మాత్రం అంతా బాగానే ఉందని చెబుతున్నారు.
గత పదేండ్లలో ప్రధాని నరేంద్ర మోదీ పది లక్షల మందికి రోజ్గార్ మేళా ద్వారా నియామక పత్రాలు అందచేయలేదా అని ఆమె ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మలా సీతారామన్ గురువారం జార్ఖండ్లో విలేకరులతో మాట్లాడారు.
పెద్దసంఖ్యలో ప్రజలు ప్రధానమంత్రి ముద్ర యోజన పధకం ద్వారా తమ వ్యాపారాలకు రుణం తీసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడలేదా అని నిలదీశారు. ఇవాళ దేశంలో పలు సోలార్ పార్క్లు వచ్చాయని, వీటిలో పెద్దసంఖ్యలో యువత ఉపాధి పొందుతోందని ఆమె వివరించారు.
Read More :
Bank Employees | వడ్డీ రహిత రుణాలపైనా పన్ను.. బ్యాంక్ ఉద్యోగులకు సుప్రీం షాక్