న్యూఢిల్లీ : సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జీలు (New Judges) నియమితులయ్యారు. వీరిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ 9 మంది కొత్త న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కొత్తగా నియమితులైన 9 మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.
సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు ఈ సిఫారసులను కేంద్రం అనుమతించగా.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వారి నియమాకం ఫైలుపై సంతకం చేసినట్లు సమాచారం. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులవుతున్న న్యాయమూర్తుల్లో .. సీనియర్ న్యాయమూర్తి బీవీ నాగరత్న కూడా ఉన్నారు. ఈమె 2027 సెప్టెంబర్ నెలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ పదవిలో నియమితులైన తొలి మహిళగా జస్టిస్ బీవీ నాగరత్న చరిత్రలో నిలిచిపోనున్నారు.
మిగిలిన వారిలో బేలా ఎం త్రివేది, హిమకోహ్లీ, సీటీ రవికుమార్, ఎంఎం సుందరేశ్, మాజీ అదనపు సాలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ, అభయ్ శ్రీనివాస్ ఓక, విక్రమ్నాథ్, జితేంద్ర కుమార్ మహేశ్వరి కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని న్యాయమూర్తులు యూయూ లలిత్, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వర్రావులతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం 9 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 9 మంది న్యాయమూర్తులను కొలీజియం సిఫారసు చేయడం, వారిని కేంద్రం ఆమోదించడం ఇదే మొదటిసారి అని తెలుస్తున్నది.
జైలులో కొత్త రకం శిక్ష వేశారు : అలెక్సీ నవాల్నీ
3 వేలకు వాటర్ బాటిల్.. 7 వేలకు ప్లేట్ అన్నం.. ఇదీ అక్కడి పరిస్థితి..!
బ్రిటీష్ వారిని దోచుకున్న విప్లవకారులు
గుండె వైఫల్యం ప్రమాదమా..? ఇలా గట్టెక్కొచ్చు..!
నిన్నటి వరకు మంత్రి.. నేడేమో పిజ్జా డెలివరీ బాయ్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..