నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గిన్నెస్ రికార్డు సాధించింది. కేవలం 105 గంటల 33 నిమిషాల్లోనే 75 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
మహారాష్ట్రలోని అమరావతి, అకోలా జిల్లాల మధ్య ఈ హైవే నిర్మించారు. 720 మంది కార్మికులు పనిచేశారు. జూన్ 3న ఉదయం 7.27 గంటలకు రోడ్డు నిర్మాణం ప్రారంభం కాగా, 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు పూర్తైంది.