Buddha Air Flight | నేపాల్ (Nepal)లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. బుద్ధ ఎయిర్లైన్స్కు చెందిన విమానం (Buddha Air Flight) ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని కాఠ్మాండూ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) చేశారు.
బుద్ధ ఎయిర్లైన్స్ విమానం సోమవారం సిబ్బంది సహా మొత్తం 76 మంది ప్రయాణికులతో నేపాల్ రాజధాని కాఠ్మాండూ (Kathmandu)లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (Tribhuvan International Airport) నుంచి భద్రాపూర్కు బయల్దేరింది. అయితే, విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. ఎడమవైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్ ఈ విషయాన్ని వెంటనే అధికారులకు తెలియజేశారు. అనంతరం విమానాన్ని త్రిభువన్ ఎయిర్పోర్ట్కు మళ్లించి అక్కడ సేఫ్గా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సమస్యపై ఎయిర్లైన్స్ స్పందించింది. విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు వివరించింది. ‘ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి కాఠ్మాండూ ఎయిర్పోర్ట్కు మళ్లించాం. ఉదయం 11:15 గంటలకు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. మా సాంకేతిక బృందం ప్రస్తుతం విమానాన్ని తనిఖీ చేస్తోంది. మరో విమానంలో ప్రయాణికులను భద్రాపూర్కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని బుద్ధ ఎయిర్లైన్స్ ఎక్స్ వేదికగా తెలిపింది.
Buddha Air flight makes VOR landing at Tribhuvan International Airport in Nepal’s Kathmandu after sustaining a flame out from the left engine. The aircraft had 76 people on board including the crew: Tribhuvan International Airport pic.twitter.com/IHbxcXriRk
— ANI (@ANI) January 6, 2025
Also Read..
HMPV | భారత్లోకి ప్రవేశించిన చైనా వైరస్.. హెచ్ఎమ్పీవీ లక్షణాలు ఇవే..!
Siddaramaiah | ఆరోపణలు చేస్తే సరిపోదు.. వాటిని నిరూపించాలి : కేంద్ర మంత్రికి కర్ణాటక సీఎం సవాల్
HMPV | బెంగళూరులో రెండు హెచ్ఎమ్పీవీ కేసులు.. ధృవీకరించిన ICMR