ఔరంగాబాద్: ప్రస్తుతం ఎక్కడ చూసినా బీజేపీ వ్యతిరేక పవనాలే వీస్తున్నాయని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది.
వీళ్లంతా మార్పు కోరుకుంటున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బీజేపీ వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి. ఈ పరిస్థితి రానున్న లోక్సభ ఎన్నికల నాటికి కొనసాగితే బీజేపీ ఓడిపోవడం ఖాయం. తప్పకుండా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని తెలిపారు.