ముంబై : దేశ రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పోరాడిందని.. సీఎం కేసీఆర్తో కలసి పనిచేస్తామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన శరద్ పవార్ సంక్షేమ పథకాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
దేశంలో ఉన్న పేదరికం కావచ్చు.. రైతుల సమస్యలు కావచ్చు.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి మేము చర్చించాం. రాజకీయంగా పెద్దగా ఏం చర్చించలేదు. ఎక్కువగా దేశ అభివృద్ధి గురించే మాట్లాడాం. భవిష్యత్తులోనూ కేసీఆర్ను కలుస్తాం. ఇంకా చాలా విషయాలు చర్చిస్తాం.. అని శరద్ పవార్ స్పష్టం చేశారు.