న్యూఢిల్లీ: భారత నావికాదళంలో సిబ్బంది కొరత ఉందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. 1,777 మంది అధికారులతో సహా 10,896 మంది సిబ్బంది అవసరమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. నావికా దళంలో మొత్తం మీద 11,979 ఆఫీసర్ పోస్టులు, 76,649 సెయిలర్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. అక్టోబరు 31 నాటికి 9,119 సెయిలర్స్ పోస్టులు, 1,777 అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.