పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో భేటీ కాబోతున్నానని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రకటించారు. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సీఎం మాన్తో భేటీ అవుతానని సిద్దూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సీఎతో చర్చిస్తానని వెల్లడించారు. నీతి నిజాయితీ, కలిసికట్టుగా వుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సిద్దూ ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు.
గతంలోనూ సీఎంపై ప్రశంసలు…
ఓ నెల క్రితం సీఎం భగవంత్పై కాంగ్రెస్ నేత సిద్దూ ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా నిజాయితీ అయిన వ్యక్తి అంటూ పేర్కొన్నారు. ఆయనను వేలెత్తి చూపనన్నారు. ఒకవేళ ఆయన పోరాడితే, తన మద్దతు కచ్చితంగా వుంటుందని తెలిపారు. పార్టీని కాదని, సీఎం భగవంత్ మాన్కు సపోర్ట్ చేస్తా.. ఎందుకంటే ఆయన పంజాబ్ కోసం పోరాడుతున్నాడు అంటూ సిద్దూ పేర్కొన్నారు.