మీరట్ : (Godse Statues) దేశవ్యాప్తంగా నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే విగ్రహాలను ప్రతిష్టించేందుకు ఆలిండియా హిందూ మహాసభ ఏర్పాట్లు చేస్తున్నది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మీరట్, గ్వాలియర్లో నాథూరాం గాడ్సే విగ్రహాలను నెలకొల్పేందుకు అన్ని సిద్ధం చేశారు. ఈ విషయాన్ని హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు పండిత్ అశోక్ శర్మ తెలిపారు. గాడ్సే, ఆప్టే విగ్రహాల ఏర్పాటుపై పోలీసులు డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు హిందూ మహాసభ కార్యాలయంపై పోలీసులు సోదాలు జరిపారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాసభ ఈ ప్రకటన చేయడం పెద్ద వివాదాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
గాంధీజీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడని కొనియాడుతూ ఆయన విగ్రహాలను నెలకొల్పాలని ఆలిండియా హిందూ మహాసభ నిర్ణయించినట్లు జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ శర్మ తెలిపారు. మీరట్ నుంచి గాడ్సేతో పాటు ఆప్టే విగ్రహాలను నెలకొల్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రానున్న రోజుల్లో దేశంలోని 11 నగరాల్లో గాడ్సే, ఆప్టే విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రెండు నగరాల పేర్లు వెల్లడించాం, త్వరలో మిగతా 9 నగరాలను కూడా ప్రకటిస్తామని అశోక్ శర్మ పేర్కొన్నారు. ఆరేండ్ల క్రితమే మీరట్లోని శారదారోడ్డులో ఉన్న హిందూ మహాసభ కార్యాలయంలో గాడ్సే విగ్రహాన్ని ప్రతిష్ఠించామని తెలిపారు.
ముస్లింలపై తమకు కోపం లేదంటూనే.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అశోక్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మహాసభ ఫండమెంటలిస్ట్ హిందుత్వను విశ్వసిస్తుందని చెప్పారు. ‘మాకు ముస్లింలతో శతృత్వం లేదు. వారు కూడా ఈ దేశంలో ఉండనివ్వండి. నమాజ్ను 5 సార్లకు బదులుగా 21 సార్లు చదవండి. అయితే, చంద్రుడు, నక్షత్రాల కింద కాకుండా ఓం జెండా కింద మాత్రమే నమాజ్ చదవాలి. ముస్లింలు భారతదేశంలో జీవించాలనుకుంటే, వారు హిందువుల ప్రకారమే జీవించాలి. వారు మన దేశం నియమాలు, చట్టాలను అనుసరించాలి’ అని పేర్కొన్నారు.
ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద మరో బాంబు పేలుడు
నీరజ్ జావెలిన్ కోచ్ ఉవే హూన్ తొలగింపు
బీఏలో ఆప్షనల్ సబ్జెక్ట్గా ‘రామ్చరిత్మానస్’.. ఎక్కడంటే?
‘నీట్’గా రూ.35 లక్షలకు పేపర్ అమ్మాడు.. ఎక్కడంటే..?
నీలి రంగు జెర్సీలోకి మారిన ఆర్సీబీ.. ఎందుకంటే?
అధికార భాషగా హిందీకి 72 ఏండ్లు
బర్రెపై ఎక్కి వచ్చి నామినేషన్ దాఖలు.. ఎక్కడంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..