కూకట్పల్లి, జూన్28: కూకట్పల్లి నియోజక వర్గంలోని ప్రతి డివిజన్ను ప్రత్యేక ప్రణాళికల ద్వారా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి డివిజన్ పరిధి వెంకట్రావు నగర్లో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించే అంతర్గత రోడ్డు అభివృద్ధి పనుల శంఖుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలో ఇప్పటికే వాటర్ పైప్లైన్ పనులు, రోడ్ల పనులు దాదాపు 90 శాతం వరకు పూర్తి కావస్తున్నాయని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలపై లాక్డౌన్ కాలంలో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు నిధులను కేటాయించి పనులను పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూకట్పల్లి నియోజక వర్గం మూసాపేట్ డివిజన్ పరిధి ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన దేవి శ్రీ జ్యువెల్లర్స్ను ఎమ్మెల్యే కృష్ణారావు, బాలాజీనగర్ కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబూరావు, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్కుమార్లు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాణ్యమైన సేవలతో వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు హరినాథ్, సుశీల్, భాస్కర్, అనిత, శ్రీకాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.