మైలార్దేవ్పల్లి, మే 9 : దమ్ముంటే బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ నేత మోహన్రెడ్డి దురహంకారంతో మాట్లాడారని, అతడి సవాల్ను స్వీకరించి బీసీల సత్తా చూపాలని, బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ పిలుపునిచ్చారు. మోహన్రెడ్డి వ్యాఖ్యలను ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖండించలేదని మండిపడ్డారు. మైలార్దేవ్పల్లి డివిజన్ దుర్గా కన్వెన్షన్లో నిర్వహించిన బడుగు, బలహీన వర్గాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను గెలిపించాలని కోరారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు బీఆర్ఎస్లో సంతృప్తిగా ఉందన్నారు. కేసీఆర్ తెలంగాణను పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. కేసీఆర్కు ప్రజలు ఈ ఎన్నికల్లో బ్రహ్మరథం పడుతున్నారన్నాని చెప్పారు. కేసీఆర్తోనే భవిష్యత్లో కూడా పయనిస్తానన్నారు. ఆరు లోక్సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరఫున బీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారని.. బీసీలకు ఎక్కువ సంఖ్యలో టికెట్లు ఇచ్చిన బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించాలని కోరారు. కాసాని జ్ఞానేశ్వర్ను అఖండ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. మిగిలిన రెండు రోజులు బాగా కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నాగేందర్గౌడ్, పురుషోత్తం, మైలార్దేవ్పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు టి.ప్రేమ్గౌడ్, యువజన నాయకుడు రఘుయాదవ్, రఘుగౌడ్, రాముయాదవ్, పాల్గొన్నారు.