జూబ్లీహిల్స్, మే 9 : జోస్ ఆలుక్కాస్ బేగంపేట్ బ్రాంచ్లో గురువారం బిగ్బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్కు బిగ్బాస్ హౌస్లో ప్రకటించిన విధంగా సంస్థ ఎండీ జాన్ అలుకా అత్యంత విలువైన డైమండ్ నెక్లెస్ను బహూకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాలలో నిస్ణాతులైన వారిని ప్రోత్సహించడంలో జోస్ ఆలుక్కాస్ ముందుంటుందని.. ఇకముందు కూడా ఇలాంటి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ లెనో, షోరూం మేనేజర్ సనోజ్ పాల్గొన్నారు.