Sachin Pilot | తన తండ్రి రాజేశ్ పైలట్ (Rajesh Pilot )పై బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ (Amit Malviya) చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) స్పందించారు. తన తండ్రి బాంబులు వేసిన మాట వాస్తవమేనని, అయితే, మాలవీయ చెప్పిన సమాచారం తప్పని స్పష్టం చేశారు.
‘1966 మార్చి 5న మిజోరాం (Mizoram) రాజధాని ఐజ్వాల్ (Aizawl)పై అప్పటి ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్రాజేశ్ పైలట్, సురేశ్ కల్మాడీ (Suresh Kalmadi)లు బాంబుల వర్షం కురిపించారు. అనంతరం ఆ ఇద్దరినీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను చేసి మంత్రి పదవులు కట్టబెట్టింది’ అంటూ అమిత్ మాలవీయ ఇటీవలే ఓ ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన సచిన్ పైలట్.. మాలవీయ ఆరోపణలను ఖండించారు. తన తండ్రి బాంబులు వేసిన మాట వాస్తవమేనని, అయితే మాలవీయ చెప్పిన తేదీలు, వివరాలు తప్పని పేర్కొన్నారు. ‘నిజమే మాలవీయ చెప్పినట్లు నా తండ్రి రాజేశ్ పైలట్ బాంబులు వేశారు. ఎయిర్ ఫోర్స్ పైలట్ గా 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. తూర్పు పాకిస్థాన్ భూభాగంపై ఆయన బాంబులు వేశారు. వాస్తవానికి మా నాన్న 1966 అక్టోబర్ 29న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. కావాలంటే సర్టిఫికెట్ చూసుకోండి’ అని సచిన్ పైలట్ వివరించారు. ఈ మేరకు తన తండ్రి ఎయిర్ఫోర్స్లో జాయిన్ అయిన సర్టిఫికెట్ ను ట్వీట్కు జోడించారు.
.@amitmalviya – You have the wrong dates, wrong facts…
Yes, as an Indian Air Force pilot, my late father did drop bombs. But that was on erstwhile East Pakistan during the 1971 Indo-Pak war and not as you claim, on Mizoram on the 5th of March 1966.
He was commissioned into the… https://t.co/JfexDbczfk pic.twitter.com/Lpe1GL1NLB— Sachin Pilot (@SachinPilot) August 15, 2023
Also Read..
Shimla | హిమాచల్లో కుంభవృష్టి.. సమ్మర్ హిల్ ప్రాంతంలో మరోసారి విరిగిపడ్డ కొండచరియలు
Rishi Sunak | ప్రధానిగా కాదు.. హిందువుగా వచ్చా .. రామ కథ కార్యక్రమంలో రిషి సునాక్