Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో దారుణం చోటు చేసుకుంది. బీఫ్ (Beef) మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని కొందరు దారుణంగా కొట్టి చంపారు. నాసిక్ జిల్లాలో శనివారం జరిగిందీ దారుణం. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబై కర్లా ప్రాంతానికి చెందిన అన్సారీ (32) తన స్నేహితుడు నాసిర్ షేక్ తో కలిసి కారులో మాంసాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర నాసిక్ జిల్లా వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారును కొందరు గోసంరక్షకులు అడ్డగించారు. అనంతరం ఇద్దరినీ దారుణంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు.
‘ఘటనాస్థలికి వెళ్లి చూడగా కారు ధ్వంసమై కనిపించింది. తీవ్ర గాయాలతో కారులో ఉన్న ఇద్దరినీ వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించాం. అక్కడ చికిత్స పొందుతూ అన్సారీ మృతి చెందాడు’ అని సబ్ ఇన్ స్పెక్టర్ సునీల్ భామ్రే తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గాయపడిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. వారు తరలిస్తున్న మాంసం బీఫా? కాదా? అనేది ల్యాబ్ పరీక్షల అనంతరం తెలుస్తుందని ఆయన వెల్లడించారు.
Also Read..
Air India | జైపూర్ లో విమానం అత్యవసర ల్యాండింగ్.. తిరిగి టేకాఫ్ చేసేందుకు నిరాకరించిన పైలట్
Himachal Pradesh Floods | హిమాచల్ లో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న పర్యాటకులు
Wrestlers | ఇకపై రోడ్డెక్కబోం.. కోర్టులో తేల్చుకుంటాం : రెజ్లర్ల కీలక నిర్ణయం