Air India | దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) ఇటీవలే ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మరోసారి అలాంటిదే జరిగింది. లండన్ (London) నుంచి ఢిల్లీ (Delhi) బయల్దేరిన ఓ ఎయిర్ ఇండియా విమానం వాతావరణం అనుకూలించని కారణంగా రాజస్థాన్ జైపూర్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అయితే, విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడంతో అందులోని 350 మంది ప్రయాణికులు 5 గంటల పాటు విమానంలోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.
లండన్ నుంచి బయల్దేరిన ఆ విమానం షెడ్యూల్ ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వద్ద వాతావరణ పరిస్థులు అనుకూలించని కారణంగా ఆ విమానం 10 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం రాజస్థాన్ లోని జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ క్రమంలో దాదాపు 2 గంటల అనంతరం విమానం తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) క్లియరెన్స్ ఇచ్చింది. కానీ, విమానాన్ని తిరిగి టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించాడు.
డ్యూటీ అయిపోయిందన్న కారణం చూపి తాను విమానాన్ని నడపబోనని తేల్చి చెప్పాడు. దీంతో అందులోని 350 మంది ప్రయాణికులు జైపూర్ ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది. వారిని గమ్యస్థానానికి చేర్చేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణికులు ఇతర మార్గాల్లో ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం కొన్ని గంటల తర్వాత ఇతర సిబ్బంది సాయంతో విమానం ఢిల్లీ చేరుకుంది.
Also Read..
Himachal Pradesh Floods | హిమాచల్ లో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న పర్యాటకులు
Wrestlers | ఇకపై రోడ్డెక్కబోం.. కోర్టులో తేల్చుకుంటాం : రెజ్లర్ల కీలక నిర్ణయం
Affair with Wife | తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. స్నేహితుడి గొంతుకోసి రక్తం తాగాడు