న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురువారం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథ్ దేవాలయంలో, రుద్ర ప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బద్రీనాథ్-కేదార్నాథ్ దేవాలయాల కమిటీ చైర్మన్, బీజేపీ నేత అజేంద్ర అజయ్, ఈ కమిటీ ఉపాధ్యక్షుడు కిషోర్ పవార్ ఆయనను కలిశారు.
ముకేశ్ తమ కమిటీకి రూ.5 కోట్లు విరాళం ప్రకటించారని అజేంద్ర తెలిపారు. తమ కమిటీ ప్రతిపాదించిన కొన్ని ప్రాజెక్టుల గురించి ఆయనకు వివరించామని, వీటికి సాధ్యమైనంత సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు.