న్యూఢిల్లీ, జనవరి 28: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ను ఇక నుంచి ‘అమృత ఉద్యాన్’గా పిలుస్తారు. ‘అమృత్ మహోత్సవ్’ ఉత్సవాల నేపథ్యంలో మొఘల్ గార్డెన్ పేరు మారుస్తున్నట్టు రాష్ట్రపతి ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా తెలిపారు.
అమృత ఉద్యాన్ను రాష్ట్రపతి ఈనెల 29న ప్రారంభిస్తారని, జనవరి 31 నుంచి మార్చి 26 వరకు సందర్శకులను అనుమతిస్తారని చెప్పారు. సాధారణంగా ప్రతిఏడాది గార్డెన్ను సందర్శకుల కోసం నెల మాత్రమే తెరుస్తారు.