శ్రీనగర్ : టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్పై పాక్ విజయంతో సంబరాలు జరుపుకున్నందుకు ముగ్గురు కశ్మీర్ విద్యార్ధులను యూపీలోని ఆగ్రాలో అరెస్ట్ చేసిన వ్యవహారంలో పీడీపీ చీఫ్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముప్తీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ప్రధానికి శనివారం ఆమె రాసిన లేఖలో అభ్యర్ధించారు.
ఈ విద్యార్ధుల భవిష్యత్ దెబ్బతినకుండా చూసేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. ఢిల్లీ, కశ్మీర్ మధ్య దూరం చెరిపేస్తామని ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మెహబూబా ముఫ్తీ ప్రస్తావించారు. జమ్ము కశ్మీర్లో పరిస్ధితి ఆందోళనకరంగా ఉందనే బాధతో తాను ఈ లేఖ రాస్తున్నానని ఆమె పేర్కొన్నారు.