న్యూఢిల్లీ : హరియాణలో (Haryana violence) హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లోని మసీదుల్లో శుక్రవారం ప్రార్ధనలు రద్దు చేశారు. ప్రజలు ఇండ్లలోనే నమాజ్ చేసుకోవాలని కోరారు. నుహ్, గురుగ్రాం సహా హరియాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మత ఘర్షణల్లో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే.
అల్లర్లు చెలరేగిన నుహ్, గురుగ్రాం సహా ఇతర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. హింస ప్రజ్వరిల్లిన ప్రాంతాల్లోని మసీదుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. హింసతో అట్టుడికిన గురుగ్రాంలో శుక్రవారం ప్రార్ధనలు రద్దు చేశామని నగర ముస్లిం కౌన్సిల్ పేర్కొంది. ప్రజలు ఇండ్లలోనే నమాజ్ చేసుకోవాలని అభ్యర్ధించింది.
ఈనెల 1న కొందరు దుండగులు గురుగ్రాం సెక్టార్ 57లోని ఓ మసీదును దగ్ధం చేసి ఇమాంను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇక వీహెచ్పీ ప్రదర్శన సందర్భంగా అల్లర్లు చెలరేగిన నుహ్లోనూ మసీదుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రార్ధనలు ఇండ్లలోనే ముగించాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read More :
Gyanvapi Mosque | గట్టి భద్రత మధ్య జ్ఞానవాపిలో ప్రారంభమైన సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ సభ్యులు