Gyanvapi Mosque | ఉత్తరప్రదేశ్ వారణాసిలోని (Varanasi) ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి (Gyanvapi) మసీదు (Mosque) ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India) శుక్రవారం ఉదయం ప్రారంభించింది. ఉదయం 7 గంటలకే మసీదు ప్రాంగణానికి చేరుకున్న భారత పురావస్తు శాఖ అధికారులు గట్టి భద్రత మధ్య శాస్త్రీయ సర్వే ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వే కొనసాగనుంది. ఆ తర్వాత మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటలకు వరకు సర్వే చేపట్టనున్నారు. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్థరించేందుకు ఈ సర్వే జరుగుతోంది. కాగా, మసీదు కమిటీ ( Anjuman Intezamia Masjid committee) సభ్యులు ఈ సర్వేను బహిష్కరించారు.
ఏమిటీ వివాదం?
వారణాసిలోని ప్రఖ్యాత విశ్వనాథ ఆలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంది. అయితే, ఈ మసీదు స్థానంలో ఒకప్పుడు శివాలయం ఉండేదని, 17వ శతాబ్దంలో మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఆదేశాలతో ఆలయాన్ని పాక్షికంగా పడగొట్టి, దాని గోడలపైనే మసీదును నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మసీదులో సర్వే నిర్వహించి సవివరమైన నివేదిక ఇవ్వాలని వారణాసి జిల్లా కోర్టు జూలై 21న ఏఎస్ఐ (ASI)ని ఆదేశించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టులో మసీద్ కమిటీ పిటిషన్ వేయగా, తీర్పును ఆగస్టు 3న (గురువారం) వెలువరించింది.
జ్ఞానవాపి (Gyanvapi) మసీదులో శాస్త్రీయ సర్వే కొనసాగించేందుకు భారత పురావస్తు శాఖ (ASI)కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అయితే, మసీదులో సర్వే చేసేటప్పుడు నిర్మాణాలకు ఎలాంటి నష్టం జరగకూడదని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో నేడు భారత పురావస్తు శాఖ సర్వేను తిరిగి ప్రారంభించింది.
Also Read..
Liquor Shop Tender | వైన్స్ల లైసెన్స్ కోసం నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ