Jaishankar | చైనా యాప్లను నిషేధించి అదేదో ఘనకార్యం అయినట్టు ప్రచారం చేసుకోవటం.. సరిహద్దుల్లో సైనికులు వీరోచితంగా పోరాటం చేస్తే తమ ఘనతగా చెప్పుకోవటం.. ఇదీ బీజేపీ ఇన్నేండ్లు సోషల్మీడియాలో చేసుకొన్న ప్రచారం. ఇక మన ప్రధాని మోదీ అయితే మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకొంటున్నదని ఎన్ని వార్తలొచ్చినా స్పందించరు. ఆయన పార్టీ పరివారం మాత్రం కమ్యూనిస్టు దేశాన్ని తమ 56 ఇంచుల ఛాతీ ఉన్న నాయకుడు బెంబేలెత్తిస్తున్నాడని జబ్బలు చరుచుకొన్నది. ఇప్పుడు ఆ ప్రచార ఆర్భాటపు గాలిబుడగ బద్ధలైంది. చైనాను చూసి మోదీ సర్కారు ఎంతగా బెంబేలెత్తిపోతున్నదో విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ స్వయంగా బయటపెట్టారు. చైనాతో మనం ఎలాంటి పోరాటంలోనూ గెలవలేమంటూ చేతులెత్తేశారు.