Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో మహా కుంభమేళా (Maha Kumbh Mela) కొనసాగుతోంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తాజాగా ప్రకటించారు.
కుంభమేళా ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి ఈనెల 30వ తేదీ వరకూ 30 కోట్ల మంది త్రివేణీ సంగమంలో నదీ స్నానాలు ఆచరించినట్లు తెలిపారు. ఇక ఇవాళ ఉదయం 8 గంటల వరకూ 43 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా ఏకంగా 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేలా ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: Drone visuals from the Ghats of Triveni as a huge number of devotees take a holy dip.
More than 43 lakh people have taken a holy dip today till 8 am; More than 30 crore people have taken a holy dip till 30th January, as per UP… pic.twitter.com/Ll04U9LuJ2
— ANI (@ANI) January 31, 2025
Also Read..
“కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం”
“మహా కుంభమేళాలో మరో అగ్నిప్రమాదం దగ్ధమైన 12 టెంట్లు”
“Maha Kumbh Mela | ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 4 వరకు కుంభమేళాకు బస్సులు రద్దు”