Mood of The Nation : రానున్న లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ మెరుగైన సామర్ధ్యం కనబరిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండగా మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీ అధిక స్ధానాలను కైవసం చేసుకుంటుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది.
గత లోక్సభ ఎన్నికల మాదిరిగానే 2024 ఎన్నికల్లో టీఎంసీ 22 స్ధానాలను దక్కించుకోనుండగా బీజేపీ ఒక స్ధానం అధికంగా 19 స్ధానాల్లో గెలుపొందుతుందని ఈ సర్వ స్పష్టం చేసింది. 42 లోక్సభ స్ధానాలు కలిగిన బెంగాల్లో 40 శాతం ఓట్లను దక్కించుకోనుండగా, టీఎంసీ 53 శాతం ఓట్లను రాబట్టనుంది.
2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్ధానాల్లో గెలుపొందగా, టీఎంసీ 22 స్ధానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ రెండు స్ధానాల్లో గెలుపొందింది. ఇక కాంగ్రెస్ ఈసారి కేవలం ఒక స్ధానానికే పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. బెంగాల్లో రానున్న లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని, విపక్ష ఇండియా కూటమిలో చేరదని సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Read More :
Hyderabad | వరవరరావు అల్లుడి ఇంట్లో ముగిసిన ఎన్ఐఏ తనిఖీలు..