బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి
న్యూడిల్లీ, మే 6: నరేంద్ర మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం అభాసు పాలవుతున్నదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల భరతమాత సిగ్గుతో తలవంచుకోవలసి వస్తున్నదని మండిపడ్డారు.
లడఖ్ విషయంలో చైనా ముందు బొక్కబోర్లా పడ్డామని, రష్యా ముందు మోకాళ్లూనవలసి వచ్చిందని, క్వాడ్లో అమెరికన్ల ముందు నోరెత్తలేకపోయామని ఆరోపించారు. ఇక అతి చిన్న దేశమైన కతార్ ముందు ఏకంగా సాష్టాంగపడవలసివచ్చిందని ఎద్దేవా చేశారు. ఇది మన విదేశాంగ విధానానికి తీవ్ర విఘాతమని ట్వీట్ చేశారు.