పెన్పహాడ్/చివ్వెంల, ఏప్రిల్ 8 : రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ మోహన్రావు అన్నారు. గురువారం పెన్పహాడ్ మండలంలోని అనంతారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో, సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్ పల్లి శివారులో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం జిల్లాలో 338 సెంటర్లు ఏర్పాటు చేశామని, ధాన్యం తీసుకొచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని టోకెన్ పొందాలన్నారు. తేమ 17శాతం కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలని, కేంద్రాలకు వచ్చే రైతులు, నిర్వాహకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామని, ఎప్పటికప్పుడు మిల్లులకు ధాన్యం తరలించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. డీఆర్డీఓ కిరణ్కుమార్, డీపీఎం గోవిందు, ఏపీఎం మల్లేశ్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ మామిడి రేవతి, పీఏసీఎస్ చైర్మన్లు నాతాల జానకీరాంరెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, డీసీఓ శ్రీనివాస్, సివిల్ సైప్లె డీఎం రాంపతి, ఏఎస్ఓ పుల్లయ్య, ఏఓ కృష్ణసందీప్, వైస్ చైర్మన్ మామిడి శ్రీనివాస్, మల్లయ్య, కోటమ్మ, బైరెడ్డి వెంకటనారాయణరెడ్డి, పొదిల నాగార్జున, మల్గిరెడ్డి కృష్ణారెడ్డి, బైరెడ్డి రాంరెడ్డి, సీఈఓ ఆలకుంట్ల సైదులు, డైరెక్టర్లు పార్వతి, ఎల్లమ్మ, జ్యోతి పాల్గొన్నారు.
నెమ్మికల్లో..
ఆత్మకూర్.ఎస్, ఏప్రిల్ 8 : నెమ్మికల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొల్లె జానయ్య, ఎంపీటీసీ ముత్తయ్య, మర్ల చంద్రారెడ్డి, తూడి నర్సింహారావు, బెల్లంకొండ యాదగిరి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
రెవెన్యూ ట్రిబ్యునల్ తీర్పులపై విజ్ఞప్తుల స్వీకరణ
ప్రైవేట్ టీచర్లకు సర్కారు సాయం