హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 15, 16 తేదీల్లో వారి విజ్ఞప్తులను తీసుకోనున్నది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాతే తుది తీర్పును వెలువరించనున్నారు.