నెలకు రెండు వేలు, 25 కిలోల బియ్యం అందజేత
వరంగల్ అర్బన్ జిల్లాలో 4వేల మందికి లబ్ధి
కలెక్టర్లకు ఎంపిక బాధ్యతలు
నేడు విధివిధానాలు జారీ
సుబేదారి, ఏప్రిల్ 8 : కరోనా కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైంది. నెలకు రూ. 2వేలతో పాటు 25కిలోల బియ్యం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నది. 8 నుంచి ఆపై తరగతులను ఫిబ్రవరి 2న పునః ప్రారంభించారు. వైరస్ సెంకడ్ వేవ్ వ్యాపిస్తుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మార్చి 24న తిరిగి విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉపాధి లేకుండా పోయింది. వారి పరిస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆదుకోవాలనే ఆలోచన నెలకు రూ. 2వేలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబందించిన విధివిధానాలు రూపొందించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాల వారీగా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు అధికారిక ఉత్తర్వులు అందాయి.
కలెక్టర్లుకు ఎంపిక బాధ్యతలు
ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయలను ఎంపిక చేసే బాధ్యతను కలెక్టర్లుకు అప్పగించింది. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల డాటా ఆయా పాఠశాలల నుంచి జిల్లా విద్యాశాఖకు ఏటా పంపిస్తుంటారు. ఈ డాటా ఆధారంగా ఏయో పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారనే సమాచారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి తెప్పించుకోనున్నారు. ఆ జాబితాలో ఉన్న ఉపాధ్యాయుల పేర్లును సరిచూసుకొని అర్హులైన వారి పేర్లు ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎంపిక విషయంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది. కలెక్టర్లతో రాష్ట్ర ఉన్నతాధికారులు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
4వేల మందికి లబ్ధి
వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రైమరీ, సెకండరీ పాఠశాలలు 459 ఉన్నాయి. వీటిలో సుమారు 4వేలకు పైగా ఉపాధ్యాయులు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాయంతో ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఎంతో కొంత ఊరట కలిగించనున్నది.
ఇవి కూడా చదవండి..
కరోనా వ్యాక్సిన్ : రెండో డోస్ వేసుకున్న ఆనందంలో బాంగ్రా డ్యాన్స్ .. వీడియో వైరల్
హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్