Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికలు దేశ భవిష్యత్ను నిర్ధారించే ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేరళలోపి పలక్కాడ్లో సోమవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ మీ భవిష్యత్ను, మీ చిన్నారుల మెరుగైన భవిష్యత్కు ఈ ఎన్నికలు గ్యారంటీ ఇస్తాయని చెప్పారు.
గత పదేండ్లుగా ఎన్డీయే ప్రభుత్వం ప్రపంచంలో భారత్ విశ్వసనీయతను ఎలా పెంచిందో మీరు చూశారని అన్నారు. భారత్ను బలహీన దేశమనే భావనను కాంగ్రెస్ ప్రభుత్వాలు కల్పించాయని చెప్పారు. భారత్పై ఈ ముద్రను బీజేపీ ప్రభుత్వం తొలగించి దేశాన్ని బలమైన దేశంగా తయారుచేసిందని తెలిపారు. ఈరోజు భారతీయులెవరైనా విదేశాలకు వెళితే వారిని గౌరవిస్తున్నారని గుర్తుచేశారు.
యుద్ధంలో చిక్కుకున్న తమ పౌరులను కాపాడుకునే సత్తాను ఇవాళ భారత్ సంతరించుకున్నదని అన్నారు. కోవిడ్ మహమ్మారి పంజా విసిరితే భారత్ వ్యాక్సిన్లను తయారుచేసి పౌరులకు అందించడమే కాకుండా ఇతర దేశాలకూ సాయం చేసిందని మోదీ గుర్తుచేశారు.
Read More :
Nagarjuna Sagar | సాగర్ వాసుల నీటిగోస.. మూడు రోజులుగా తాగు నీళ్లులేక తల్లడిల్లుతున్న ప్రజలు