నాగార్జునసాగర్: ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధానికి అక్కడి నుంచి నీళ్లు సరఫరా చేస్తారు.. లక్షల ఎకరాల్లో వరిసాగుకు నీటిని తరలిస్తారు. అయినా అక్కడి ప్రజలకు మాత్రం తాగునీళ్లకు తిప్పలు తప్పడంలేదు. పక్కనే కృష్ణమ్మ బిరబిరా పారుతున్నా గుక్కెడు నీళ్ల కోసం నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రజలు గోసపడుతున్నారు. నందికొండ కాలనీల్లో సాధారణంగా రోజువిడిచి రోజు నీటిని సరఫరా చేస్తుంటారు. అయితే మోటార్లు మరమ్మతులకు గురికావడంతో మూడు రోజులుగా తాగు నీళ్లు లేక ప్రజలు తల్లడిల్లుతున్నారు. ట్యాంకుల్లో వస్తున్న అకకొర నీటితో సరిపెట్టుకుంటున్నారు.
కాగా, ఈ నెలారంభంలో నందికొండలోని ఓ మంచి నీటి ట్యాంకులో 30 కోతుల కలేబరాలు దొరికిన విషయం తెలిసిందే. కోతులు ట్యాంకులో పడి చనిపోయినప్పటికీ.. సిబ్బంది నీటిని అలాగే ఇండ్లకు సరఫరా చేశారు.