Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో ఓవైపు కాంగ్రెస్ విధ్వంస మోడల్కు మరోవైపు మోదీ గ్యారంటీలకు మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ఏ పక్షం వహిస్తారో తేల్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ అదేపనిగా అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు.
హిమాచల్ ప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే తొలి క్యాబినెట్లోనే ఇది జరుగుతుంది..అది జరుగుతుందని కబుర్లు చెప్పారని కానీ ఏం జరగలేదని, మంత్రివర్గమే ధ్వంసమైందని ఎద్దేవా చేశారు. అధికారం కోసం పూటకో మాట చెప్పే కాంగ్రెస్ను విశ్వసించవద్దని ఆయన ప్రజలను కోరారు.
అగ్ర కులాల్లోనూ పేదలు ఉంటారని, వారికీ రిజర్వేషన్లు అవసరమని కాంగ్రెస్కు 60 ఏండ్లుగా తెలియలేదని దుయ్యబట్టారు. ఈ కులాల గురించి కాంగ్రెస్ ఎన్నడూ ఆలోచించలేదని, మోదీ వచ్చిన తర్వాతే అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు. దీంతో సమాజంలో అన్ని వర్గాలకూ అవకాశాలు దక్కుతున్నాయని అన్నారు.
Read More :
World War | కొన్ని వారాల్లో మూడో ప్రపంచ యుద్ధం!