Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల తుది పోరు ప్రచారం పతాకస్ధాయికి చేరింది. విపక్ష ఇండియా కూటమి మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుంకాలో మంగళవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
మోదీ జీవించినంత వరకూ గిరిజనులు, దళితులు, బీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాల వారి రిజర్వేషన్లను ఎవరూ తొలగించిలేరని ఆయన స్పష్టం చేశారు. ఆదివాసీలు, దళితులు, ఓబీసీల కోటాను గుంజుకుని వాటిని ఓట్ జిహాద్కు పాల్పడే ముస్లింలకు అప్పగించడాన్ని తాను అనుమతించబోనని మోదీ పేర్కొన్నారు.
జార్ఖండ్లో చొరబాటుదారుల ముప్పు నెలకొందని పలు ప్రాంతాల్లో చొరబాట్ల సవాళ్లు ఎదుర్కొంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆదివాసీల సంఖ్య తగ్గుముఖం పడుతూ చొరబాటుదారుల సంఖ్య పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనుల భూములను చొరబాటుదారులు గుంజుకుంటున్నారా..లేదా..? అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read More :
NTR | ఎన్టీఆర్ 101వ జయంతి.. నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ