న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దు వద్ద భారత భూభాగంలో చైనా 101 ఇండ్లు నిర్మించినట్టు గతంలో వైరల్ అయిన ఫొటోలు గుర్తున్నాయా! గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆ ఫొటోలపై ఇప్పుడు నెట్టింట్ట పెద్ద చర్చ జరుగుతున్నది. ఇటీవల ప్రయోగించిన ఈవోఎస్-06 శాటిలైట్ తీసిన గుజరాత్ చిత్రాలు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
అయితే, గతంలో అరుణాచల్లో అక్రమంగా చైనా నిర్మించిన గ్రామానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ.. నెటిజన్లు మోదీకి కౌంటర్ ఇచ్చారు. ‘ఆ ఈవోఎస్-06 శాటిలైట్తోనే చైనా ఆక్రమణల చిత్రాలను తెప్పించుకొని ఇప్పటికైనా చర్యలు తీసుకోండి. తర్వాతైనా గుజరాత్ అందాలను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు’ అని మోదీకి టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి చురక అంటించారు.