న్యూఢిల్లీ: పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ను ఇండియా కొనుగోలు చేసినట్లు అమెరికాకు చెందిన న్యూ యార్క్ టైమ్స్ పత్రిక ఓ సంచలన కథనాన్ని రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ సర్కార్ దేశద్రోహానికి పాల్పడినట్లు ఆయన తన ట్విట్టర్లో ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై నిఘా పెట్టేందుకు మోదీ సర్కార్ ఇజ్రాయిల్ నుంచి పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసినట్లు రాహుల్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజకీయవేత్తలు, ప్రజలపై ఆ స్పైవేర్తో నిఘా పెట్టినట్లు ఆయన ఆరోపించారు. గవర్నమెంట్ సంస్థలు, ప్రతిపక్ష నేతలు, సైనిక దళాలు, న్యాయవ్యవస్థతో లింకున్న వారి ఫోన్లను పెగాసస్తో ట్యాప్ చేసినట్లు రాహుల్ ఆరోపించారు. ఇవన్నీ దేశద్రోహ పనులే అన్నారు.