ఔరంగాబాద్: న్యాయమూర్తుల బలహీనతలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు విచారణ సంస్థలను ఉపయోగించుకుంటున్నదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు.
రాజ్యాంగం ప్రకారం స్వంతంత్య్రంగా ఉండాల్సిన వ్యవస్థలను కేంద్రం గుప్పిట పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది పేర్కొన్నారు. తమకు అనుకూలంగా ఉండరని అనుకుంటున్న వారు అత్యున్నత స్థానంలో న్యాయమూర్తిగా నియామకం కాకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆరోపించారు.