Sawalkot Project | పాక్కు భారత్ గట్టి షాక్ ఇవ్వబోతున్నది. చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టును తిరిగి చేపట్టబోతున్నది. దాంతో పాకిస్తాన్కు భారత్ అడ్డుకట్ట వేయనుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్ జమ్ముకశ్మీర్లో పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టు పునరుద్ధరణకు సిద్ధమవుతున్నది. చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఇటీవల అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది.
ఇదివరకే తుల్బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. చీనాబ్ నదిపై సావల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన 1980 సంవత్సరం నుంచే ఉన్నది. పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిలిచిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సింధూ జలాల ఒప్పందం అమలును ఇటీవల నిలిపివేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు కేంద్రం ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 1,856 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.22వేల కోట్లు అవుతుందని అంచనా. దాదాపు రెండు దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ బిడ్డింగ్కు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకున్నది. చివరగా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు కూడా రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైందని సమాచారం.