న్యూఢిల్లీ : ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) కార్యాలయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పలు ప్రాంతీయ పార్టీల నేతలు హాజరు కానున్నారు. అనంతరం ఆ నేతలతో కలిసి కేసీఆర్ సమావేశం కానున్నారు.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పాటు చేయాలి, పూజలు జరిపే ప్రదేశాలను, వేదిక, ఇతర ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈరోజు సాయంత్రం కేసీఆర్ ఢిల్లీ చేరుకోనున్నారు. రేపు ఉదయం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయం సందర్శించి ఏర్పాట్లపై నేతలను అడిగి తెలుసుకోనున్నారు. పరిస్థితులు, ఏర్పాట్లకు అనుగుణంగా పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం.