ముంబై/ లక్నో : మహారాష్ర్టలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్న క్రమంలో అక్కడున్న వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ర్టకు వలసొచ్చిన సుమారు 80 వేల మంది కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. గత రెండు, మూడు రోజుల నుంచి యూపీకి వెళ్లే రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్, లక్నో వెళ్లే రైళ్లు రద్దీతో నిండిపోయాయి.
లాక్డౌన్ భయంతోనే తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నామని వలస కార్మికులు చెబుతున్నారు. మహారాష్ర్ట కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్నాయి. టీకా ప్రక్రియ కూడా నెమ్మదిగా కొనసాగుతోంది. లాక్డౌన్ విధిస్తే తమ కుటుంబ పోషణకు ఆటంకం కలుగుతుందని వలస కార్మికులు పేర్కొంటున్నారు. ఉన్న కొద్దిపాటి డబ్బుతో సొంతూర్లోనే జీవిస్తామని అంటున్నారు.