దేశంలో మధ్యతరగతి వర్గం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది. ఎంతలా అంటే దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు మధ్యతరగతి వర్గానికి చెందినవారే. ధనికులు మరింత ధనికులవుతున్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా అందుబాటులోకి వచ్చిన విద్య, వైద్య, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొన్న పేదలు మధ్యతరగతి వర్గంగా ఎదుగుతున్నారు. ఎటోచ్చీ నిరుపేదలు మాత్రమే అక్కడే ఉంటున్నారు. 2047 నాటికి భారత్లో ఈ వర్గీకరణ మరింత స్పష్టంగా కనిపించనున్నదని పీపుల్ రిసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జూమర్ ఎకానమీ (ప్రైస్) సర్వేలో తేలింది.
2004-05లో దేశ జనాభాలో మధ్యతరగతి ప్రజల శాతం – 14 %
2021-22నాటికి దేశ జనాభాలో మధ్యతరగతి ప్రజల శాతం – 31%
1994-95లో దేశంలోని అత్యంత ధనవంతుల సంఖ్య – 98,000
దేశంలో నిరుపేదల సగటు వార్షికాదాయం – 1,35,000
2020-21నాటికి దేశంలో కుబేరులు – 18,00,000
ధనికుల సగటు వార్షికాదాయం – 2 కోట్లు