హైదరాబాద్ : చిప్కో ఉద్యమ నాయకుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, పర్యావరణ వేత్త సుందర్ లాల్ బహుగుణ మృతి చెందడం బాధాకరమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బహుగుణ చెట్లతో పాటు అంతరించిపోతున్న జంతు పక్షి జాతుల రక్షణకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం పరితపించిన గొప్ప వ్యక్తి అని అతడి సేవలను గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. కాగా, ఇటీవల కరోనా సోకడంతో చికిత్స పొందుతూ సుందర్ లాల్ బహుగుణ తుదిశ్వాస విడిచారు.
ఇవి కూడా చదవండి..
షాపు తెరిచినందుకు రూ.3 వేల జరిమానా
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం