ఇంఫాల్: అల్లర్లతో అట్టుకుతున్న మణిపూర్లో మరోసారి వాతావరణం వేడెక్కింది. మైతీ తెగ నాయకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఆయన తృటిలో తప్పించుకున్నారు. మైతీ తెగకు చెందిన మైతీ లీపున్ చీఫ్ (Meitei Leepun’s) ప్రమోత్ సింగ్ (Pramot Singh) తన డ్రైవర్తో కలిసి ఇంఫాల్లోని (Imphal) ఓ దవాఖాన వెలుపల నిలబడ్డారు. అదేసమయంలో కారులో వచ్చిన సాయుధుడు (Gunmen) వారిపై కాల్పులు జరిపాడు. అయితే వారు క్షేమంగా బయటపడ్డారు.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో ప్రమోత్ కారులోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు గుర్తించారు. కాగా, అక్టోబర్ 9న ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మతపరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల్లో ఆయనపై స్థానిక కోర్టు నాన్బెయిల్బుల్ వారెంట్ జారీచేసింది. అయితే ఆయన ఇప్పటివరకు అరెస్టు కాలేదు.
రిజర్వేషన్లకు సంబంధించి ఈ మే నెలలో మణిపూర్లో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 180 మందికిపైగా మరణించారు. గతవారం ఓ పోలీస్ అధికారిని దుండగులు కాల్చివేయడంతో మరోసారి అల్లర్లు చెలరేగాయి. దీనికి నిరసనగా ఇంఫాల్లోని ఓ పోలీస్ స్టేషన్పై ఆందోళనకారులు దాడికి దిగారు. స్టేషన్లో ఉన్న ఆయుధాలను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.