న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ప్రపంచంలో తనకంటే గొప్పోడు ఎవరూ లేరని, తానే అందరికంటే గొప్పోడినన్న ఫీలింగ్లో ప్రధాని మోదీ ఉంటారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. ఆయనను విమర్శిస్తే అస్సలు తట్టుకోలేరని తెలిపారు. అంతేకాదు.. ఎవర్నీ అభినందించటానికి ఇష్టపడరని, అది ఆయన వ్యక్తిత్వమే కాదని వ్యాఖ్యానించారు. పలు సందర్భాల్లో ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టిన సత్యపాల్ మాలిక్ త్వరలో పదవీ విరమణ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా ఆయనను ‘ది వైర్’ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహావిష్కరణలో చోటుచేసుకొన్న సందర్భాన్ని గుర్తుచేస్తూ.. విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో చాపర్లో తానొక్కడినే ఉండాలని, కెమెరాల్లో తాను మాత్రమే కనిపించాలని మోదీ ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. పదవీ విమరణ అనంతరం రైతులకు మద్దతు ధర కల్పించేలా పోరాటం చేస్తానని పేర్కొన్నారు.